కామేపల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. సోమవారం కామేపల్లిలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమానికి ఎమ్మెల్యే హరిప్రియనాయక్ హాజరై అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వాములు మొండ్రు పుల్లయ్య, తాళ్ళూరి జనార్థన్ ఆధ్వర్వంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఆంతోటి అచ్చయ్య, మేకల మల్లిబాబుయాదవ్, మల్లెంపాటి శ్రీనివాసరావు, గుగులోత్ సుందర్, గబ్రూనాయక్, అజ్మీర రాందాస్నాయక్, రాజునాయక్, లకావత్ సునీత తదితరులు పాల్గొన్నారు.