టేకులపల్లి, సెప్టెంబర్ 1: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతినిధిగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకొచ్చా.. ఆశీర్వదించండి. అధిక మెజార్టీ అందించండి..’ అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. బీఆర్ఎస్ పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. టేకులపల్లి మండలంలోని 36 పంచాయతీల్లో శుక్రవారం విస్తృతంగా పర్యటించిన ఆమె.. ఆయా గ్రామాల్లో ప్రజలను కలుస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కొందరు ప్రజలు తమ గ్రామాల్లోని సమస్యలను విన్నవించగా.. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫోన్లలో ఆదేశాలు జారీ చేశారు. శంభునిగూడెం గ్రామంలో ఉదయం 7 గంటలకు పర్యటనను పారంభించిన ఆమె.. ప్రతి గామంలోనూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోనే మాత్రమే అన్ని వర్గాల ప్రజలకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు భూక్యా రాధ, బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్, బానోత్ రామానాయక్, బానోత్ కిషన్నాయక్, చీమల సత్యనారాయణ, కంభంపాటి చంద్రశేఖర్రావు, దళపతి శ్రీనివాసరాజు, బర్మావత్ శివకృష్ణ, బానోత్ రవికుమార్, అనంతుల శ్రీనివాస్, కుమ్మరి కిరణ్, కాలే ప్రసాద్, గుగులోత్ కృష్ణ, పూజరి వెంకట్, బానోత్ శంకర్, ఉండేటి బసవయ్య, జయరాజు తదితరులు పాల్గొన్నారు.