బయ్యారం అక్టోబర్ 25: బీఆర్ఎస్తోనే ప్రజాసంక్షేమం సాధ్యమని బీఆర్ఎస్ ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని కాచనపల్లి, నామాలపాడు, కొత్తపేట, సింగారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గడిచిన ఐదేండ్లలో రూ.1,800 కోట్లతో ఇల్లెందు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఇల్లెందు ప్రజల చిరకాల స్వప్నమైన బస్సు డిపోను సాకారం చేశామన్నారు.
సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ప్రజలు మారో బీఆర్ఎస్కు ఓటు వేసి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలన్నారు. 1న ఇల్లెందులో జరుగనున్న సీఎం ప్రజా ఆశ్వీరాద సభను విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్పర్సన్ బిందుకు గ్రామగ్రామాన ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తాతా గణేష్ , గంగుల సత్యనారాయణ, బానోతు మురళీకృష్ణ, రేఖ ఉప్పలయ్య, సంకు సత్తిరెడ్డి, ఏనుగుల ఐలయ్య, బానోతు శ్రీను నాయక్, మమత, కోటి, ఉపేంద్ర, భద్రయ్య, లక్ష్మణ్నాయక్, ఆర్వీ కృష్ణ, వెంకటపతి, సైదులు, రాము, రాజేశ్, రవి ఉన్నారు.