‘ప్రతిపక్షాల పాచికలు పారవు.. ఎత్తుగడలు ఫలించవు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంటుంది.. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.. సంక్షేమ పాలనను కొనసాగిస్తారు..’ అని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ధీమా వ్యక్తం చేశారు. కామేపల్లి మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. విజయమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.
– కామేపల్లి, మే 5
కామేపల్లి, మే 5: రాష్ట్రంలో వందకు పైగా సీట్లతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. శ్రేణులు కష్టించి పని చేసి అధిక మెజార్టీ అందించాలని, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. కామేపల్లి మండలం ముచ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో సంపదను సృష్టించి పథకాల రూపంలో ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని అన్నారు. దేశ రాజకీయాలను శాసించబోయేది కేసీఆరేనని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలకు దేశంలో ఎంతో ఆదరణ లభిస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో రకరకాల రూపాల్లో వచ్చే వేషగాళ్లను నమ్మవద్దని సూచించారు. అలాగే ప్రతిపక్షాల విష ప్రచారాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముందుగా జాస్తిపల్లి నుంచి ఫంక్షన్ హాల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బానోత్ హరిసింగ్నాయక్, ధనియాకుల హనుమంతరావు, బానోత్ సునీత, తీర్థాల చిదంబరరావు, ఆంతోటి అచ్చయ్య, మల్లెంపాటి శ్రీనివాసరావు, విజయలక్ష్మి, జాయ్లూసీ, కాంతమ్మ, విష్ణువర్థన్రెడ్డి, నరసింహారావు, మోహన్రెడ్డి, భాస్కర్, పాపారావు, శంకర్, బాబు, కోటయ్య, రాంబాబు, సూర్యనాయక్, భగవాన్, శంకర్, గబ్రూనాయక్, రవి, వీరప్రతాప్, కృష్ణారెడ్డి, కృష్ణప్రసాద్నాయక్, సరిరాంనాయక్, భీమానాయక్, సునీత, అనంతరాములు, రాందాస్నాయక్, నాగజ్యోతి, బాబు, వెంకటస్వామి, భిక్షపతి, మదార్సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.