న్యూఢిల్లీ, ఆగస్టు 12 : బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,600 ఎగబాకి రూ.1.60 లక్షలకు చేరువైంది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.1,59, 800గా నమోదైంది. అంతకుముందు రోజు ఈ ధర రూ.1,57,200గా ఉన్నది. గడిచిన వారం రోజుల్లో పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.12,400 లేదా 8.4 శాతం ఎగబాకినట్టు అయిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
ఈ నెల 3న తులం బంగారం ధర రూ.1,47,400గా ఉన్నది. బంగారంతోపాటు వెండి పరుగులు పెడుతున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.4 వేలు ఎగబాకింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో ధర రూ.2.46 లక్షలు పలికింది.