కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలో శుక్రవారం మంత్రి విస్తృత పర్యటన చేశారు. తొలుత నగరంలోని అల్లీపురం, చర్చికాంపౌండ్ సెంటర్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. రఘునాథపాలెం మండల కేంద్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచులను సన్మానించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో 262 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. గోపాలపురంలో 8, 14, 15 డివిజన్లకు సంబంధించిన 406 మందికి పట్టాలు అందజేశారు.
– ఖమ్మం, రఘునాథపాలెం, మార్చి 24
ఖమ్మం, మార్చి 24: కంటి వెలుగు కార్యక్రమం మన ఇంటికే వెలుగు లాంటిదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వంద రోజుల పాటు చేపడుతున్న ఈ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం నగరంలోని 15వ డివిజన్ అల్లిపురం రైతువేదిక, 24వ డివిజన్ శాంతినగర్ మిషన్ హాస్పిటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒకరికీ కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అందరమూ కలిసి విజయవంతం చేద్దామని అన్నారు. కంటి వెలుగు నిర్వహించేందుకు గ్రామంలో కావాల్సిన వసతులను స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించాలని, ప్రజలందరూ కంటి పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. కాగా, దీర్ఘకాలంగా అల్లిపురంలో తాము ఎదురొంటున్న ఇనాం భూముల హకుల సమస్యకు మంత్రి అజయ్ చొరవతో పరిషారం లభించిందని, ఈ భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన తమకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ద్వారా ఆయా భూమిపై హకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన రైతులు పేర్కొన్నారు.
60 మంది పేదలకు ఓఆర్సీ పట్టాలు..
కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ అల్లిపురంలో ఎన్నో ఏళ్లనాటి ఇనాం భూముల సమస్యను మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించారని, 60 మంది రైతులు ఓఆర్సీ పట్టాలు అందించడం సంతోషకరమని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 3 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి కళ్ల జోళ్లు అందించినట్లు వివరించారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్, అదనపు కలెక్టర్ మధుసూదన్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, ఆర్డీవో రవీంద్రనాథ్, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, డాక్టర్ బాలకృష్ణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రావూరి కరుణ, కూరాకుల వలరాజు, అర్బన్ తహసీల్దార్ శైలజ పాల్గొన్నారు.