ఖమ్మం, అక్టోబర్ 27: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి అందించిన మంత్రి పదవి సహకారంతో నాలుగేళ్లలో ఖమ్మాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని అన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను మరోసారి గెలిపించాలని కోరుతూ నగరంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను కలుసుకొని వారితో మాట్లాడారు. మంత్రిగా నాలుగేళ్లపాటు విశ్రాంతి లేకుండా పని చేసి ఖమ్మం రూపురేఖలు మార్చానని గుర్తుచేశారు. ఒకప్పుడు గొంగళిపురుగులా ఉన్న ఖమ్మాన్ని నేడు సీతాకోకచిలుకలా తీర్చిదిద్దానని వివరించారు. తనకు మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు. ఈ సందర్భంగా నగర ప్రముఖులైన దండా గురవయ్య, దండా సత్యవతి, దొండ పాటి వెంకటేశ్వర్లు, కృష్ణారావు, శ్రీనివాసరెడ్డి, వెంకట్రెడ్డి, పంది హనుమంత్రావు, వత్సవాయి రవి, ఆళ్ల సత్యనారాయణ, దిరిశాల వేంకటేశ్వరరావు, కమతం రామారావు, కొండేటి గోపి, డాక్టర్ బత్తుల సరోజ, జానకిరామయ్య, రెమిడిచర్ల మాధవరావు, లీలావతి, పోట్రు వేణుగోపాల్, తుళ్లూరు రామారావు, ఏ.మురళీధర్రావు, ఉషారాణి, బండ్ల సత్యనారాయణ, సరోజినీ, కమతం రామకృష్ణ, చింతల వెంకన్న, కర్నాటి సంధ్య, సుధాకర్, రామా కోటయ్య తదితరులను వారి ఇళ్లలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. శాలువాలతో వారిని సతరించి మద్దతు కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, కొత్తపల్లి నీరజ, కూరాకుల వలరాజు, వల్లభనేని రామారావు, కాటా సత్యనారాయణ, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం నగరంలోని 26వ డివిజన్ ప్రభాత్ టాకీస్ దగ్గరలోని రామాలయం పునఃనిర్మాణ పూజా కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం నగర మేయర్ పూనుకొల్లు నీరజ హాజరయ్యారు.