ఖమ్మం, ఏప్రిల్ 15 : గోళ్లపాడు కాలువ ఆధునీకరణతో త్రీటౌన్కు మహర్దశ పట్టిందని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఖమ్మం 46వ డివిజన్ జూబ్లీపురలో గోళ్లపాడు ఛానల్పై నిర్మించిన మహ్మద్ రజబ్ అలీ పారును, రూ.1.86 కోట్లతో ఏర్పాటుచేసిన వీధి వ్యాపారుల సముదాయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నగరంలో సుదీర్ఘకాలంగా గోళ్లపాడు కాలువలో పేరుకుపోయిన మురుగును పూర్తిగా తొలగించి సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. కాలువ అంతర్భాగంలో మురుగు, వర్షపు నీరు పారడానికి పైపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాలువ పైభాగాన దాదాపు పది పారులు, క్రీడా ప్రాంగణాలు, బస్తీ దవాఖానలు, పట్టణ ప్రకృతి వనాలు, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే రూ.200 కోట్లకు పైగా ఆస్తి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇకడి నుంచి తరలించిన వారికి వెలుగుమట్ల వద్ద స్థలాలు ఇచ్చామని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరగడంతో వారంతా లక్షాదికారులై సంతోషంగా ఉన్నారని అన్నారు. నగరంలో దాదాపు 23 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేశామన్నారు. వాటి పైభాగంలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే సుందరమైన పారులు, ఆరోగ్యాన్ని అందించే ఓపెన్ జిమ్లు, ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం తన పుట్టినరోజు నాడు ఇదే మోతీనగర్లో గోళ్లపాడు కాలువ మురుగులోకి దిగి దానిని తొలగించే పనిని ప్రారంభించామని గుర్తుచేశారు. ఐదేళ్ల కల నేటికి సాకారమైందని స్పష్టం చేశారు.
ఖమ్మం త్రీటౌన్లో ప్రతిష్టాత్మంగా మున్నేరుపై కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. అది లకారం కంటే అద్భుతంగా ఉండనుందని అన్నారు. నగరాభివృద్ధి కోసం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. వందల కోట్ల నిధులు తేగలిగామన్నారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసిన అధికారులను మంత్రి పువ్వాడ అభినందించారు. మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, సుడా చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, సీపీఐ నాయకులు ఎండీ మౌలానా, దండి సురేశ్, ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, అధికారులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, కన్నం వైష్ణవీ ప్రసన్నకృష్ణ, బీజీ క్లెమెంట్, ముకాల కమల, సరస్వతి, ఎల్లంపల్లి వెంకటేశ్వర్లు, చామకురి వెంకన్న, రంజిత్, కృష్ణలాల్, రంగారావు, సుజాత, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, రవినాయక్, కొత్తా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.