ఖమ్మం, సెఫ్టెంబర్ 16 : జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల గడప గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరొన్నారు. శనివారం నగరంలో లాళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా మంజూరైన 105 మందికి మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అజయ్ చెకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదింటి ఆడిబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఖమ్మం కార్పొరేషన్-59, రఘునాధపాలెం -46 మొత్తం 105 చెకులకు గానూ రూ .1.05 కోట్లు పంపిణి చేశారు.
నేటి వరకు నియోజకవర్గంలో 8,631 చెకులకు రూ.81.36 కోట్ల విలువైన చెకులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ కమర్తపు మురళి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, తహసీల్దార్ స్వామి, కార్పొరేటర్లు గజ్జెల లక్ష్మీ, దొన్వాన్ సరస్వతి, పాకాలపాటి విజయ, బూర్రి వినయ్ కుమార్, దాదే అమృతమ్మ, ప్రశాంతి లక్ష్మీ, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి హరి ప్రసాద్, సిటీ లైబ్రరీ చైర్మన్ ఆశ్రీఫ్, రుద్రగాని ఉపేందర్, యర్రా అప్పారావు, గజ్జల వెంకన్న, ఆళ్ళ అంజిరెడ్డి, మాటేటి నాగేశ్వర రావు, బోజెడ్ల్ రాం మోహన్, షకీన ఉన్నారు.