ఖమ్మం, సెప్టెంబర్ 10 : మునుపెన్నడూ చూడని వరదలు మనం చూశామని, రాత్రికి రాత్రి వరద తీవ్రత ప్రమాదస్థాయికి చేరుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి కారణంగా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో మున్నేరు బాధిత 1,718 కుటుంబాలకు కోటి 50 లక్షల రూపాయల చెకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మానికి పంపారని, అర్ధరాత్రి 3గంటల వరకు శ్రమించి ప్రతి ఒకరినీ కాపాడడం జరిగిందన్నారు.
వరదల సమయంలో ఎటూ వెళ్లకుండా పేదలకు అండగా నిలిచానని మంత్రి తెలిపారు. వరదలు తగ్గిన వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో వీధులను శుభ్రం చేసినట్లు పేర్కొన్నారు. వరద బాధితులకు సాయం చేయాలన్న విజ్ఞప్తి మేరకు ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి, నా కోడలు పువ్వాడ అపర్ణ రూ.50 లక్షలను కలెక్టర్ అకౌంట్కు బదలాయించి, అట్టి మొత్తాన్ని నేడు పంపిణీ చేస్తున్నామన్నారు. మున్నేరు వరదలో నేను పర్యటిస్తున్నప్పుడు టీవీలో చూసిన నా కోడలు చలించి తన తాత కంపెనీ నుంచి రూ.50 లక్షల ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
అడిగిన వెంటనే స్పందించిన దాతలకు ధన్యవాదాలు చెప్పారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఒకో కుటుంబానికి రూ.8,463 చొప్పున పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎకువగా నష్టపోయిన బొకలగడ్డ ప్రాంతంలో 615 మందికి 51లక్షల 90వేల 600 రూపాయలు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం ఆర్డీవో జి.గణేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మాటేటి అరుణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, కన్నం వైష్ణవిప్రసన్న కృష్ణ, మాటేటి కిరణ్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్ స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ(చిట్యాల ఐలమ్మ) వర్ధంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నివాళి అర్పించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం పాలనకు, విసునూరు దేశ్ముఖ్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో మేయర్ నీరజ, విజయ్కుమార్, నాగభూషణం, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.