ఖమ్మం: రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంఎల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయ ఇంచార్జీ గుండాల(ఆర్జేసీ)కృష్ణ ,పలువురు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.