నేలకొండపల్లి, జనవరి 6: మండలంలోని రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్స్, పవర్ ఇండస్ట్రీస్ను రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు సందర్శించారు. ఫ్యాక్టరీలో చెరుకు నుంచి పంచదార తయారు చేసే విధానం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీల గురించి మంత్రికి నామా వివరించారు.
కార్యక్రమంలో ఎండీ నామా కృష్ణయ్య, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, సీజీఎం కోటయ్య, సర్పంచులు దండా పుల్లయ్య, గండు సతీశ్, సీడీసీ మాజీ చైర్మన్ యాసా విష్ణువర్థన్రెడ్డి, సొసైటీ చైర్మన్ తన్నీరు కృష్ణమూర్తి, డైరెక్టర్ వీరవెల్లి నాగరాజు, చింతనిప్పు సైదులు, సూరపనేని రామకృష్ణ, దండా రంగయ్య, రైతులు పాల్గొన్నారు.
మంత్రికి వినతి : అమ్మగూడెం సర్పంచ్ గండు సతీశ్ శుక్రవారం ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి గ్రామ అభివృద్ధి కోసం వినతిపత్రం అందజేశారు. గ్రామంలో రెండు వరుసల రోడ్డు నిర్మించాలని, అమ్మగూడెం నుంచి కోనాయిగూడెం, ఆరేగూడెం వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు. స్పందించిన మంత్రి నిధుల మంజూరునకు కృషి చేస్తానని తెలిపారు.