కూసుమంచి, మార్చి 13 : రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాయకన్గూడెం, గట్టుసింగారం, చేగొమ్మ, చౌటపల్లి గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని, తన పర్యటన సమయంలో ఆయా దరఖాస్తులను వెంటనే పరిశీలించి వాటిపై నిజానిజాలు తేల్చాలన్నారు. అనంతరం గట్టుసింగారం మాజీ సర్పంచ్ రమణను పరామర్శించారు.
చేగొమ్మ, నాయకన్గూడెం, గట్టుసింగారం గ్రామాల్లో భూ ఫిర్యాదులను స్వీకరించిన మంత్రి ఆర్డీవో నరేశ్కు వాటిని అందజేశారు. విద్యుత్ సమస్యలను ఏడీఈ కోక్యానాయక్కు, పంచాయతీరాజ్కు సంబంధించిన సమస్యలను ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డికి ఇచ్చి వాటిపై గ్రామాల్లోకి వెళ్లి విచారణ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, సుడిగాలి కిషన్రావు, ఏసీపీ తిరుపతిరెడ్డి, స్థానిక నాయకులు జూకూరి గోపాల్రావు, బజ్జూరి వెంకటరెడ్డి, ఎడవల్లి రాంరెడ్డి, హఫీజుద్దీన్, మంకెన వాసు, సూర్యనారాయణరెడ్డి, కొండపర్తి సురేశ్, లింగారెడ్డి, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి, వినోద, తహసీల్దార్ సురేశ్కుమార్, డీఈ వేణుగోపాల్, రమేశ్రెడ్డి, ఏవో వాణి తదితరులు పాల్గొన్నారు.