కూసుమంచి/ఖమ్మం, డిసెంబర్ 14: పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా సెక్రటెరియట్లో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన గ్రౌండ్ ఫ్లోర్లోని 10,11,12 బ్లాక్లు కేటాయించారు. బాధ్యతలు చేపట్టిన పొంగులేటికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలిపాన వారిలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, జారె ఆదినారాయణ, బాలునాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీరెడ్డి, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, సమాచారశాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీలు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, సీఈ రాధాకృష్ణ, నాయకులు రామసహాయం సురేందర్రెడ్డి, రేణుకా చౌదరి, రాయల నాగేశ్వరరావు, నిరంజన్రెడ్డి, స్వర్ణకుమారి, నరేశ్రెడ్డి, మల్లారెడ్డి, రవికుమార్, గోపాల్రావు, రమేశ్, సీతారామలు, శ్రీనివాస్, అశోక్, వెంకటరెడ్డి, సుధాకర్రెడ్డి, హఫీజుద్దీన్, మంకెన వాసు, స్వర్ణ, మంగీలాల్, రమ్య ఉన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం గురువారం తొలి సంతకాన్ని భువనగిరి స్పోట్స్ కాంప్లెక్స్కు 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇచ్చిన దస్తావేజుపై సంతకం చేశారు. 33 జిల్లాల డీపీఆర్ఓల కార్యాలయాలను అనుసంధానం చెసే అధునాతన కెమేరాలను అందజేసే ఫైల్పై సంతకాన్ని చేశారు.
కూసుమంచి,డిశంబర్ 14: శానససభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్కుమార్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
తిరుమలాయపాలెం/ఖమ్మం రూరల్, డిసెంబర్ 14: రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గురువారం మండల కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు బోడ మంగీలాల్, బెల్లం శ్రీనివాసరావు, రామసహాయం నరేష్రెడ్డి, చావా శివరామకృష్ణ, కొప్పుల అశోక్, ఉప్పనూతల నాగేశ్వరావు, అజ్మీర అశోక్, కేవీ చారి శుభాకాంక్షలు తెలిపారు. చింతకాని మండల నాయకుడు కిలారు మనోహర్బాబు పలువురు నాయకులతో కలిసి రెవెన్యూ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.