ఖమ్మం, నవంబర్ 11: తుమ్మ ముల్లుల తుమ్మల మనకు వద్దని.. బీఆర్ఎస్ పార్టీనే ముద్దు.. అని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని 29, 30, 31, 32వ డివిజన్ నందు బీఆర్ఎస్ అధ్వర్యంలో శనివారం సాయంత్రం కార్పొరేటర్లు, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తల నడుమ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్కుమార్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. మొండి చెయ్యికి ఓటు వేస్తే మనకు కరెంట్ కట్.. నీళ్లు బంద్.. అభివృద్ధి శూన్యమని ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. ఇకడికి కొందరు పౌడర్ అద్దుకుని వస్తున్నారు.. వాళ్ళను శాశ్వతంగా తరిమి కొట్టాలని కోరారు. ఇకడ మారెట్ను కాంగ్రెస్ అభ్యర్థి నాడు పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల స్వయంగా మారెట్ను ఇకడి నుంచి తరలించేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు.. ఇకడ పేదలు, కార్మికులు, కర్షకులు మారెట్పై ఆధారపడ్డ పేద ప్రజలను ముంచేందుకు సిద్ధమయ్యాడు.. ఆ విషయం నాకు తెలిసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మారెట్ను ఇకడి నుంచి వెళ్లనివ్వను అని ప్రజల వైపు నిలబడ్డా అన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్లు, నాయకులు ఎర్రా అప్పారావు, మక్కాల కమల రాజేష్, రాంబాబు, దోన్వాన్ సరస్వతి రవి, పగడాల నాగరాజు, మెంతుల శ్రీశైలం, నున్నా మాధవరావు, షకీనా పాల్గొన్నారు.
రఘునాథపాలెం, నవంబర్ 11: కాంగ్రెస్ అంటే కాలిపోయిన మోటర్లు, రైతు ఆత్మహత్యలు, లాఠీ దెబ్బలని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మండల పరిధి గణేశ్వరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. గణేశ్వరంలో ప్రతి రోడ్డును సీసీగా మార్చానన్నారు. అడిగిన ప్రతి రోడ్డుకు నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రచారంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జెడ్పీటీసీ ప్రియాంక, వర్తక సంఘం అద్యక్షుడు చిన్ని కృష్ణారావు, ఉపసర్పంచ్ సుజాత, మండల పార్టీ అద్యక్షుడ వీరూనాయక్, మాజీ జెడ్పీటీసీ కుర్రా భాస్కర్రావు, జోగు ఎల్లబాబు, తులిస్యా, బలరాం, ఆదినారాయణ, మూడ్ వీరు, హనుమంతరావు, సతయం, హరి, శంకర్, బాబు, వసంతరావు పాల్గొన్నారు.