కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 3 : స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణపై భద్రాద్రి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు మన బాధ్యతను మరింతగా పెంచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో కలెక్టర్ అనుదీప్ను సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు, నిరక్షరాస్యత, మారుమూల ప్రాంతాలు, గిరిజన గూడేలున్నా భద్రాద్రి జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమాల్లో జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనా పథంలో పనిచేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి దేశానికే ఆదర్శంగా నిలపాలని, అన్నిరంగాల్లో ఇప్పటికే అగ్రగామిగా ఉన్నామని, మరింత ఉత్సాహంగా పనిచేసి జిల్లాను అభివృద్ధిలో ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, పీఆర్ డైరెక్టర్ హనుమంతరావు, డీఆర్డీవో మధుసూదన్రాజు, డీపీవో రమాకాంత్, ఎస్బీఎం కన్సల్టెంట్స్ రేవతి, ఖాదర్ పాల్గొన్నారు.