కారేపల్లి, ఫిబ్రవరి 02 : కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం మొట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య సిబ్బంది పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్ హెచ్ పి మహాలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కుష్టు వ్యాధి నివారణపై అవగాహన కల్పిస్తూ కుష్టు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా వైకల్యాన్ని నిర్మూలించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు కళావతి, సునీత, శ్రావణి, ఆశ పద్మ పాల్గొన్నారు.