ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్నగర్కు చెందిన కేబుల్ వ్యాపారి షేక్ అమ్జద్ 92లక్షల 25వేల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. 2010 నుంచి దివాలా పిటిషన్ దారుడు కేబుల్ వ్యాపారం చేసేవాడు. ఈక్రమంలో వ్యాపారాభివృద్ది కోసం 25మంది రుణదాతల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాపారంలో ఒడిదిడుకులకారణంగా నష్టాలు రావడం, ప్రతివాదుల నుంచి ఒత్తిడి అధికమవడంతో బాధితుడు దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నాడు.