మణుగూరు టౌన్, మార్చి 17: లోక్సభా ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆదివారం పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు, గుండాల మండలంలోని పలుచోట్ల చెక్పోస్టులు ప్రారంభించారు.
సారపాక, మార్చి 17: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రెవెన్యూ అధికారులు మోరంపల్లిబంజర్లో చెక్పోస్టు ఏర్పాటు చేశారు. డబ్బు, మద్యం అక్రమ తరలింపును నిరోధించేందుకే చెక్పోస్టు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ ముజాహిద్ మీడియాకు తెలిపారు. తహసీల్దార్ వెంట ఆర్ఐలు నర్సింహారావు, ముత్తయ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.