ఖమ్మం లీగల్, ఫిబ్రవరి 10: వచ్చే నెల 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి పీ.చంద్రశేఖరప్రసాద్ అన్నారు. అన్ని రకాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక వేదిక అని వివరించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్ఙల్ భుయాన్ ఆదేశించిన విధంగా రాబోయే జాతీయ లోక్ అదాలత్లో రాజీపడదగిన క్రిమినల్, సివిల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి విభాగాల కింద దాఖలైన కేసులను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలను ఇతరులకు తెలియజేయడానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు జిల్లాల పోలీసు అధికారులు, న్యాయమూర్తులు ఈ దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఈ మెగా లోక్ అదాలత్ను విజయవంతంచేయాలని కోరారు.