మధిర, అక్టోబర్ 29: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు.. ఆరు అబద్ధాలని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే ప్రజలు నట్టేట మునిగినట్లేనన్నారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మధిర పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సొంత పదవుల మీదే ఆలోచన అని మండిపడ్డారు. మరోసారి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడుతుందన్నారు. ఆరు గ్యారెంటీల స్కీములతో కాంగ్రెస్ పారీ నాయకులు ప్రజల మధ్యకు వస్తారన్నారు.
వారి మాటలు ప్రజలు నమ్మొద్దన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్గా తనకు సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారని, ఒకవైపు ఆ పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు మధిర ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. అనంతరం బీఆర్ఎస్లో చేరిన పలువురికి గులాబీ కండువాలు కప్పి కమల్రాజు పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలో పార్టీ నాయకులు శీలం విద్యాలత, అరిగె శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, కరివేద సుధాకర్, యన్నంశెట్టి అప్పారావు, బిక్కి కృష్ణప్రసాద్, గుగులోతు కృష్ణ, నరసింహారావు పాల్గొన్నారు.