బోనకల్లు అక్టోబర్ 11: మధర నియోజకవర్గ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. బుధవారం ఆయన మండలంలోని గోవిందాపురం-ఎ గ్రామానికి విచ్చేసి దళితబంధు అమలు చేస్తున్నందుకు గాను ఎస్సీలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్లో చేరిన 20 కుటుంబాలకు చెందిన వ్యక్తులకు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రజలకు అందుబాటులో లేకుండా కాంగ్రెస్ఆ పార్టీ కార్యకలాపాల్లో బిజీ బిజీగా ఉంటారన్నారు. ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన మాత్రం హైదరాబాద్కే పరిమితమవుతారని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో ఆయనపై తాను పోటీ చేసి ఓడిపోయానని, అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్ఠానం మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నానన్నారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ప్రజలకు అండగా ఉంటున్నానన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. దళితబంధు, గృహలక్ష్మి వంటి పథకాలు అమలు కావని కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కానీ ఇప్పటికే ఆయా పథకాలు ఎంతోమందికి వర్తించాయన్నారు. పర్యటనలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, మధిర మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు జంగా రవి, బీఆర్ఎస్ నాయకులు గద్దల వెంకటేశ్వర్లు, వెంగళ కనకయ్య, పారా ప్రసాద్, గండమాల చుక్కారావు, భాగం మధుసూదన్రావు, వడ్డెబోయిన చుక్కయ్య, మేదరమెట్ల రాజారావు, షేక్ రషీద్, బూసిపోగు సైదులు, ఉయ్యూరు రాధాకృష్ణ, కరివేద సుధాకర్, తమ్మారపు బ్రహ్మయ్య పాల్గొన్నారు.
మధిర, అక్టోబర్ 11 : బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బుధవారం ఉదయం ‘టీవీఎం వాకర్స్’ సభ్యులతో కలిసి మధిర పట్టణంలో జాగింగ్ చేశారు. అనంతరం వారితో మాట్లాడారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా జడ్పీ చైర్మన్గా ప్రజలకు సేవలందించానన్నారు. పార్టీ అధిష్ఠానం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మరోసారి అవకాశం కల్పించిందని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు మరింత సేవచేస్తానన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నానన్నారు.