మధిర రూరల్, నవంబర్ 11: మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దామని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. మధిర మండలంలో శనివారం పర్యటించిన ఆయన.. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి మాటూరుపేట, నాగవరప్పాడు, సిద్ధినేనిగూడెం, సైదల్లిపురం, నిధానపురం, దెందుకూరు, ఖమ్మంపాడు, తొండలగోపవరం, చిలుకూరు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే మధిర నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్ల నిర్మించామని, మౌలిక వసతులు కల్పించామని అన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే అయిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం తన రాజకీయ లబ్ధికోసం ఆరాటపడుతున్నారని, అందుకోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చే భట్టివిక్రమార్కకు ఇక విశ్రాంతి ఇద్దామని అన్నారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనకు ఒకసారి అవకావం ఇవ్వాలని కోరారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రావూరి శివనాగకుమారి, తోక రాజరాజేశ్వరి, గుర్రాల పెద్దనాగిరెడ్డి, బాదా కృష్ణారెడ్డి, వెంపటి మరియమ్మ, పింగళి వెంకటరామిరెడ్డి, దొండపాటి రుక్మిణమ్మ, ఆత్మకమిటీ చైర్మన్ గుర్రం రామారావు, బంధం శ్రీనివాసరావు, మెండెం లలిత, దొండపాటి వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్, కటికల వెంకటసత్యనారాయణరెడ్డి, బొగ్గుల వీరారెడ్డి, బొగ్గుల భాస్కర్రెడ్డి, శీలం వెంకటరెడ్డి, కూన నరేందర్రెడ్డి, చావా వేణు, రావూరి రామారావు, కరివేద సుధాకర్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మెండెం వెంకన్న, అయిలూరి ఉమామహేశ్వరరెడ్డి, జిల్లేపల్లి బాబురావు, వేమిరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.