కామేపల్లి, ఫిబ్రవరి 4 : మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం గంజాయి, మాదక ద్రవ్యాల నివారణపై పోలీసులు, సింగరేణి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్వంలో ప్రజాప్రతినిధులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. సీఐ ఆరీఫ్ అలీఖాన్, ఎంపీపీ బానోత్ సునీత, ఎస్సై లక్ష్మిభార్గవి, ఎంపీడీవో సీలార్సాహెబ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కారేపల్లి, ఫిబ్రవరి 4: యువత చెడువ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును చెడగొట్టుకోవద్దని కారేపల్లి సీఐ ఆరీఫ్అలీఖాన్ సూచించారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులో మాట్లాడారు. ఎస్సై, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
పెనుబల్లి, ఫిబ్రవరి 4 : నేటి యువత రాష్ర్టాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సత్తుపల్లి రూరల్ సీఐ టీ కరుణాకర్ అన్నారు. పెనుబల్లి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన కల్పించి మాట్లాడారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎస్సై సూరజ్, ప్రిన్సిపాల్ , అధ్యాపకులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, ఫిబ్రవరి 4 : మాదక ద్రవ్యాల నిర్మూలనకు కలిసికట్టుగా పనిచేయాలని ఎస్సై షేక్ షాకీర్ అన్నారు. శుక్రవారం మైనార్టీ గురుకుల పాఠశాలలో మాదకద్రవ్యాల వినియోగంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. గంజాయి మూలాలను గుర్తించి తొలగించాలని పేర్కొన్నారు. సదస్సులో ప్రిన్సిపాల్ కత్తి వెంకట్రామయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వేంసూరు, ఫిబ్రవరి 4: యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని ఎస్సై సురేశ్ సూచించారు. చౌడవరం ఉన్నత పాఠశాలలో గంజాయి, డ్రగ్స్ నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఏఎస్సై వెంకటేశ్వరరావు, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొణిజర్ల, ఫిబ్రవరి 4 : డ్రగ్స్ నివారణలో ప్రతి విద్యార్థి భాగస్వాములు కావాలని ఎస్సై యయాతిరాజు సూచించారు. తనికెళ్ల విజయ ఇంజినీరింగ్ కళాశాలలో గంజాయి, డ్రగ్స్ నివారణకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తల్లాడ, ఫిబ్రవరి 4 : యువత ఎటువంటి దురలవాట్లకు బానిస కాకుండా సన్మార్గంలో నడిచి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని వైరా సీఐ వసంతకుమార్ అన్నారు. కేఎస్ఎం జూనియర్ కళాశాలలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. గ్రామాల్లో గుడుంబా తయారీ, డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న వారి సమాచారం పోలీసులకు అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై, కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.