ఖమ్మం: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రఉద్యానవనశాఖ ఉప సంచాలకురాలు, సూక్ష్మనీటి పథకం ప్రత్యేక అధికారిణి విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయతో కలిసి పలు మండలాల్లో పర్యటించారు. 2018-19, 2019-20 సంవత్సరాలలో సూక్ష్మనీటి పథకం ద్వారా డ్రిప్, స్ప్రింకర్లు తీసుకున్న రైతుల పంట పొలాలను ఆమె పరిశీలించారు. చింతకాని మండలం వందనం, నరసింహపురం, బోనకల్ మండలంలోని ముష్టికుంట్ల, బ్రాహ్మణపల్లి, ఎర్రుపాలెం మండలంలోని చొప్పకట్లపాలెం, మీనవోలు, కాచారం, మధిర మండలంలోని కృష్ణాపురం, వైరా మండలంలోని తాటిపుడి గ్రామాలలో ఆమె పర్యటించారు.
రైతులు తీసుకున్న యంత్రాలు ఏ విధంగా సహయా పడుతున్నాయి…? తద్వార వారికి కలిగే అదనపు ప్రయోజనాల గురించి ఆమె అడగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడారు. అన్నదాతల ఆసక్తి మేరకు తెలంగాణ సర్కార్ సూక్ష్మనీటి పథకం ప్రవేశపెట్టి ఉద్యాన పంటల సాగు రైతులకు భారీ రాయితీలపై అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకొని కూరగాయలు, పండ్లు , పూలసాగు విస్తీర్ణం మరింత పెంచుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారులు ఆకుల వేణు, సూక్ష్మనీటి పథకం ఇంజనీరు పీ నాగమణి, డ్రిప్ కంపెనీల ప్రతనిధులు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.