కొత్తగూడెం సింగరేణి/మణుగూరు రూరల్/ఇల్లెందు, ఫిబ్రవరి 10 : సింగరేణి సంస్థకు సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని సింగరేణి ఏరియా ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కార్మికులకు టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్మికులంతా మరో ఉద్యమానికి సిద్ధంగా ఉం డాలని, సింగరేణిని ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోనీయకుం డా కాపాడేందుకు మోదీకి తగిన బుద్ధి చెప్తామన్నారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటామని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు.
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట నిరసన దీక్ష చేపట్టాం. నాలుగు బొగ్గు బ్లాకులను బహిరంగ వేలంలో పెట్టకుండా అడ్డుకొని తీరుతాం. మోదీ కుట్ర పూరితంగానే లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తులకు అమ్ముకునేందుకు దశలవారీగా బహిరంగ వేలం పెట్టి ఆ తరువాత నష్టాలు వచ్చాయనే నెపంతో పూర్తిగా ప్రైవేట్పరం చేయడానికి కుట్ర పన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాన్ని అధిగమిస్తూ లాభాల బాటలో పయనిస్తోంది.
– వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే కొత్తగూడెం
లాభాల బాటలో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు సాగిస్తున్నది. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సింగరేణివ్యాప్తంగా తిప్పికొట్టాలి. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతాం. తెలంగాణ ప్రయోజనం కోసం ప్రజాప్రతినిధులుగా ఈ ఉద్యమంలో మేం ముందు భాగాన నిలబడతాం. ఈ ఉద్యమంలో యావత్ తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావా
– హరిప్రియానాయక్, ఎమ్మెల్యే, ఇల్లందు
చెమట చుక్కను చిందించి దేశానికి వెలుగులు పంచే కార్మికలోకానికి అన్యాయం చేసే విధంగా ప్రయత్నించి, సింగరేణిలోని నాలుగు కోల్ బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే తట్టెడు మట్టి కూడా ఎత్తనిచ్చేది లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి బీజేపీ చేసిందేమీ లేదు. పైగా బంగారు తెలంగాణలో కీలక భూమిక పోషిస్తున్న సింగరేణిని కూడా ప్రైవేటీకరించేందుకు మొండిగా నిర్ణయాలు తీసుకుంటున్నది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అయినప్పటికీ మొండి వైఖరిని వీడకుంటే బీజేపీకి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతాం. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో కార్మికులతో కలిసి దశలవారీగా ఆందోళనలు చేపట్టి ఢిల్లీకి సెగ తగిలిస్తాం. కార్మికుల పక్షాన వారికి అండగా ఉంటాం, సింగరేణిని కాపాడుకుంటాం.
– రేగా కాంతారావు , టీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే