మధిరరూరల్, జూన్14 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎంపీపీ మెండెం లలిత, ఎంపీడీవో కే.విజయభాస్కర్రెడ్డి, ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. వంగవీడు ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం వారు పరిశీలించి మాట్లాడారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఈ ప్రదీప్, సర్పంచ్ బొగ్గుల పద్మావతి, విద్యా కమిటీ చైర్మన్ సత్యంబాబు, హెచ్ఎం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, జూన్ 14 : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని సర్పంచ్ నూతలపాటి మంగతాయారమ్మ అన్నారు. అనంతసాగర్ గ్రామం లో మంగళవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామంలో విద్యార్ధుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సారిక వెంకటేశ్వర్లు, రైతుబంధుసమితి గ్రామకన్వీనర్ నూతలపాటి వెంకటేశ్వర్లు, కార్యదర్శి కోటీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, జూన్ 14: పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పవర్ డే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని విద్యుత్ లైన్ల సమస్యలను పరిష్కరించారు. కొత్తకొత్తూరులో సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ విద్యుత్ అధికారులతో కలిసి విద్యుత్ లైన్లను సరి చేయించారు. ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీడీవో జమలారెడ్డితో కలిసి పరిశీలించారు. సర్పంచ్ రాయపూడి నవీన్, ట్రాన్స్కో ఏఈ బాలాజీ, ఉపసర్పంచ్ ఏడుకొండలు పాల్గొన్నారు.
మధిరరూరల్, జూన్ 14 : రాయపట్నంలో సర్పంచ్ నండ్రు సుశీల ఆధ్వర్యంలో మంగళవారం పల్లెప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి సునీత, వార్డుమెంబర్ సంజీపు రేణుక, సిబ్బంది సురేశ్, దేవదానం, వెంకటయ్య, నాగయ్య, వెంకటేశ్వర్లు, మల్టీపర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
మధిరటౌన్, జూన్ 14 : మధిర వార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను చేపట్టారు. డ్రైనేజీల్లో పూడికతీత, రోడ్ల వెంట పిచ్చిమొక్కల తొలగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడికొండ కిరణ్, టీఆర్ఎస్ నాయకులు నాగరాజు, నర్సమ్మ, భవాని, కౌన్సిలర్ మేడికొండ కళ్యాణికిరణ్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.