చింతకాని, జూన్ 14 : దళితబంధు పథకం ద్వారా దళితులంతా ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకాని రైతువేదికలో దళితబంధు లబ్ధిదారులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకోవాలని, అర్హులైన ప్రతిఒక్కరికీ దళితబంధు ఫలాలు అందుతాయని అన్నారు. దళితబంధు ద్వారా ఇప్పటికే మండలంలో సగానికి పైగా దళితులు లబ్ధిపొందారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ మంగీలాల్, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, సర్పంచ్లు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.