ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్/ రఘునాథపాలెం/ ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం లీగల్, జనవరి 26: అహింసా మార్గం ఎల్లప్పుడూ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. ఆ స్ఫూర్తితోనే ఉద్యమించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు తమ తమ కార్యాలయాల్లోనే త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. గణతంత్ర వేడుకల ప్రాముఖ్యతను గుర్తుచేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ అట్టడుగు వర్గాల ప్రజలకూ చేరువవుతున్నాయని, ఆయా పథకాలతో ఆయా వర్గాల ప్రజలు లబ్ధిపొందుతున్నారని వివరించారు. టీఆర్ఎస్ కార్యాలయంలో ఆర్జేసీ కృష్ణ, మంత్రి అజయ్ క్యాంపు కార్యాలయంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, సుడా కార్యాలయంలో కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, కేఎంసీలో మేయర్ నీరజ, డీసీసీబీలో చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఎన్జీవోస్ కార్యాలయంలో అఫ్జల్హసన్, ఏఎంసీలో చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న తదితరులు పతాకావిష్కరణ గావించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 53, 50, 25, 46 డివిజన్లలో కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య నాగరాజు, రాపర్తి శరత్, గోళ్ల చంద్రకళ వెంకట్, కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ తదితరులు మూడు రంగుల జెండాలను ఎగురవేశారు. జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మనకు గర్వకారణమన్నారు.
విద్యాసంస్థల్లో..
గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఖమ్మంలోని విద్యాసంస్థల్లో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. స్మార్ట్కిడ్జ్లో చింతనిప్పు కృష్ణచైతన్య, త్రివేణిలో యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఎస్బీఐటీలో ఆర్జేసీ కృష్ణ, న్యూవిజన్లో సీహెచ్జీకే ప్రసాద్, హార్వెస్ట్లో పీ.రవిమారుత్, బొమ్మ కళాశాలలో బొమ్మా రాజేశ్వరరావు, బొమ్మా సత్యప్రసాద్, రెజొనెన్స్లో శ్రీధర్, ఆర్వీ నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు, శ్రీచైతన్యలో శ్రీధర్, శ్రీవిద్య, న్యూఇరాలో రమణారావు, పీ.భూమేశ్వరరావు, విన్ఫీల్డ్లో శ్రీకాంత్, పుల్లారావు, కిశోర్, శ్రీవిద్యానికేతన్లో రాంప్రసాద్, నిర్మల్ హృదయ్లో సాంబశివారెడ్డి, ఇంటర్ కార్యాలయంలో డీఐఈవో రవిబాబు, డీఈవో కార్యాలయంలో డీఈవో యాదయ్య, లైబ్రరీలో సిబ్బంది, పీజీ కళాశాలలో అయిలయ్య తదితరులు పతాకావిష్కరణ