వైరా, జనవరి 25 : మండల కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో వెంకటపతిరాజు సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కారేపల్లి, జనవరి 25 : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకిట్యాతండాలో వైరా నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడు గుగులోత్ శివానాయక్ ఓటునమోదుపై మంగళవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ అర్హత కల్గిన వారు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కల్లూరు, జనవరి 25 : ఓటు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనదని ఎంపీపీ బీరవల్లి రఘు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ఆయన అధికారులతో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పెనుబల్లి, జనవరి 25 : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయించారు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వేంసూరు, జనవరి 25 : ఓటు ప్రతి ఒక్కరి హక్కు, తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలని ఎంపీడీవో వీరేశం అన్నారు. కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఫైజుద్దీన్, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరరావు, ఎంపీడీవో, ఏపీవో పాల్గొన్నారు.
కామేపల్లి, జనవరి 25 : ఓటే వజ్రాయుధమని, ప్రతి ఓటరూ తన ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని తహసీల్దార్ కృష్ణ అన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యం వివరించి ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ తహసీల్దార్ కనకం నరసింహారావు, గిర్ధావర్ సుజాత, శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తల్లాడ, జనవరి 25 : ప్రతిఒక్కరికీ ఓటే వజ్రాయుధమని, ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీందర్రెడ్డి అన్నారు. పోలింగ్బూత్ల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ఈవోఆర్డీ కొండపల్లి శ్రీదేవి, సెక్రటరీలు పాల్గొన్నారు.