కూసుమంచి, జనవరి 25: మండలంలోని అన్ని గ్రామాల్లో ఐదో రోజు మంగళవారం జ్వర సర్వేలో 69 టీంలు పాల్గొన్నాయి. 2,695 ఇండ్లలో సర్వే చేశామని, వారిలో 40 మందికొ కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు పంపిణీ చేశామని వైద్య డీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు 15,312 ఇండ్లను సర్వే చేయగా వారిలో 277 మందికి కొవిడ్ వచ్చిందని తెలిపారు.
బోనకల్లు, జనవరి 25: మండలంలోని 22 గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. వైద్యాధికారులు రామాపురంలో ప్రతిఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.
తిరుమలాయపాలెం, జనవరి 25: మండలంలోని అన్ని గ్రామాల్లో జ్వరపీడితుల సర్వే కొనసాగుతున్నది. తిరుమలాయపాలెంలో ఇంటింటా సర్వే నిర్వహించి జ్వరపీడితులకు కిట్లు పంపిణీ చేశారు.
చింతకాని, జనవరి 25: మండల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటి జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నదని మండల వైద్యాధికారి అల్లాడి నాగేశ్వరరావు అన్నారు.
మధిరరూరల్, జనవరి 25: మున్సిపాలిటీతో పాటు, మండలంలోని పలు గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి మెడికల్ కిట్లను అందజేశారు.
మధిరరూరల్, జనవరి25: మధిర మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డీ.ధీరజ్కుమార్ ఆదేశాల మేరకు మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భైరవబట్ల శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్స్కు బూస్టర్ డోస్ వేశారు.
కూసుమంచి రూరల్, జనవరి 25: ఈనెల 21న చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగుతోంది. సర్వేలో భాగంగా ప్రతి ఇంటిలో ప్రజల ఆరోగ్య పరిస్థితిని నమోదు చేసి, అవసరమైన వారికి మందులు అందజేస్తున్నారు. అలాగే రెండో డోస్ తీసుకోని వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. రూరల్ గ్రామాల్లో మంగళవారం 2 వేల ఇండ్లలో సర్వే చేసి, కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు అందజేశారు.