పెనుబల్లి, జూలై 27 : అడవిమల్లేల పల్లె ప్రకృతి వనం బాగుందని, పనులు బాగా చేపట్టారని కలెక్టర్ వీపీ గౌతమ్ సర్పంచ్ మండదపు అశోక్కుమార్ను అభినందించారు. తొలుత లంకాసాగర్ డ్యామ్ వద్ద కొబ్బరి మొక్క నాటి అనంతరం లంకాసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు సామర్థ్యం, ఆయకట్టు తదితర వివరాలను ఈఈ శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అడవిమల్లేల పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి అన్ని రకాల మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండలంలో ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ త్వరితగతిన పూర్తయ్యేలా చేసి వినియోగంలోకి తేవాలని ఎంపీపీ లక్కినేని అలేఖ్యకు సూచించారు.
అనుమతులు లేకుండా లేఔట్లు చేస్తే చర్యలు : గ్రామపంచాయతీ స్థాయిలో లేఔట్ చేసేవారు అనుమతులు లేకుండా చేపడితే చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మండాలపాడులో వెంచర్లను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించి మాట్లాడారు. లంకపల్లిలో పంచాయతీ కార్యాలయంలో రికార్డులను మంగళవారం పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పల్లెప్రగతి కార్యక్రమంలో పంచాయతీల్లో చేసిన పనులు, ఖర్చుల వివరాలు సక్రమంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విద్యాచందన, డీపీవో ప్రభాకర్, జడ్పీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ చెక్కిలాల మోహన్రావు, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మీ, ఎంపీవో వాల్మీకి కిషోర్, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ రమాదేవి, పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ, సీఐ కరుణాకర్, ఎస్సై తోట నాగరాజు, ట్రైనీ ఎస్సైకవిత, ఐబీ డీఈ రామారావు, ఏఈ కిరణ్, సర్పంచ్ మువ్వా బేబి సరోజని, ఎంపీటీసీ శ్యామల, కార్యదర్శి అఖిల్, ఉపసర్పంచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.