బోనకల్లు, జూలై 24: మధిర మండలంలో ముక్కోటి వృక్షార్చన విజయవంతమైంది. దెందుకూ రు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మొక్క నాటి ప్రారంభించారు. స్వీట్లు పంచారు. మధిరలోని శ్రీవసంతమ్మ మానసిక వికలాంగుల సేవాకేంద్రంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పంచారు. ప్రజాప్రతినిధులు, నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, మెండెం లలిత, కోట విజయశాంతి, కోట వెంకటకృష్ణ, మల్లాది వాసు, రావూరి శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, కనుమూరి వెంకటేశ్వరరావు, కరివేద సుధాకర్, అరిగె శ్రీనివాసరావు, ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, ఎంపీవో రాజారావు పాల్గొన్నారు. బోనకల్లు మండలంలోని రాయన్నపేట గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి ప్రారంభించారు. బోనకల్లు గ్రామంలోని చెరువు కట్టపై మధిర ఎక్సైజ్ అధికారులు ఖర్జూర మొక్కలు నాటారు. సర్పంచ్ సైదానాయక్, ఉప సర్పంచ్ రాఘవ పాల్గొన్నారు.
చింతకాని, జూలై 24: మండలంలోని గాంధీనగర్, నాగులవంచలో ముక్కోటి వృక్షార్చనలో జడ్పీచైర్మన్ కమల్రాజ్, విత్తనాబివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరా వు, టీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, జూలై 24: మండలంలోని జమలాపురం, తక్కెళ్లపాడు గ్రామాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మొక్కలు నాటారు. ముందుగా జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కేటీఆర్ పేరు మీద అర్చన చేయించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు మూల్పూరి స్వప్న, కూరపాటి సుందరమ్మ, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, శైలజ, యశోద, చావా రామకృష్ణ, దేవరకొండ శిరీష, శీలం కవిత, శీలం వెంకట్రామిరెడ్డి, వేమిరెడ్డి త్రివేణి, శ్రీకాంత్రెడ్డి, మూల్పూరి శ్రీనివాసరావు, బొర్రా నారాయణ, సాంబశివరావు పాల్గొన్నారు.
తండ్రికి తగిన తనయుడు
టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తండ్రి కేసీఆర్కు తగిన తనయుడని పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో శనివారం కేటీఆర్ జన్మదినోత్సవంలో కేక్ కట్ చేశారు. అనంతరం రోడ్డు వెంబడి మొక్కలను నాటించారు. ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ను గ్రామ స్థాయి లో కేటీఆర్ బలోపేతం చేశారని అన్నారు. సర్పంచ్ తాటికొండ సుదర్శన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు బెల్లం ఉమావేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్, బెల్లం వేణుగోపాల్, దరగయ్య, గొడ్డుగోర్ల వెంకటేశ్వర్లు, అక్కినపల్లి వెంకన్న, నల్లపునేని అప్పారావు, రమణయ్య, మట్టా వెంకటేశ్వరరావు, సతీశ్, వెంపటి రవి, మైబేల్లి పాల్గొన్నారు.
కూసుమంచి, జూలై 24: కూసుమంచిలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు రామసహాయం బాలకృష్ణారెడ్డి, బాణోత్ శ్రీనివాస్, ఇంటూరి శేఖర్, వడ్త్యి సేట్రాం నాయక్, బాణోత్ రాంకుమార్, జూకూరి గోపాల్రావు, చాట్ల పరశురాం, ఆసీఫ్ పాషా, చెన్నా మోహన్, బజ్జూరి రాంరెడ్డి, మోదుగు వీరభద్రం, అలీ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ‘ము క్కోటి’ మొక్కల పండుగ(వృక్షార్చన) గా జరుపుకున్నారు. ఎక్కడికక్కడ మొ క్కలు నాటి, నీళ్లు పోశారు. కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.