ఖమ్మం వ్యవసాయం, పిబ్రవరి 9: ఖమ్మం ఏఎంసీకి మరోసారి మిర్చి పంట (ఎర్ర బంగారం) పోటెత్తింది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో పొరుగు జిల్లాల నుంచి కొద్ది రోజులుగా రైతులు భారీగా పంటను తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం జెండాపాట సమయానికి సుమారు 30 వేల బస్తాలు వచ్చినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆర్.మల్లేశం తెలిపారు. అనంతరం జరిగిన జెండాపాటలో రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.19,550 ధర పలికింది. మధ్య ధర రూ.18,500, కనిష్ఠ ధర రూ.18,500 చొప్పున ఖరీదుదారులు కొనుగోలు చేశారు. రెండేళ్ల క్రితం ఇదే మార్కెట్లో ఏసీ రకం మిర్చికి రూ.22 వేల ధర పలికిన విషయం విదితమే. అయితే సాధారణ రకం పంటకు ఇంత ధర రావడంతో ఖమ్మం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక పత్తి పంటకు సైతం ఆల్టైం రికార్డు ధర పలికింది. ఉదయం ఆన్లైన్ బిడ్డింగ్లో ఖరీదుదారులు క్వింటాకు రూ.10,200 చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. గత నెలలో ఇదే మార్కెట్లో నమదైన రూ.10 వేల రికార్డును అధిగమిస్తూ బుధవారం మరో 200 అదనంగా పలికింది.