చింతకాని, ఫిబ్రవరి 9: తెలంగాణ జాతికి ప్రధాని మోదీ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో చింతకానిలో కమల్రాజు ఆధ్వర్యాన పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కమల్రాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థ్ధానంలో ఉండడాన్ని ఓర్వలేకనే మోదీ అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. మోదీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులను ఏకం చేస్తుండడాన్ని తట్టుకోలేని ప్రధాని మోదీ.. తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. మోదీకి, బీజేపీకి తెలంగాణ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
బోనకల్లు: మండల కేంద్రంలో మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి మోదుగు నాగేశ్వరరావు, వేమూరి ప్రసాద్, బంధం శ్రీనివాసరావు, బానోతు కొండ, చావా హనుమంతరావు, దారగాని నారాయణ, యనిగల మురళి, ఇటికాల శ్రీనివాసరావు, కాకాని శ్రీనివాసరావు, షేక్ నజీర్, రేగళ్ల వీరయ్య, షేక్ మదార్, షేక్ బాషా, షేక్ హుస్సేన్, బొమ్మకంటి సైదులు, తమ్మారపు బ్రహ్మయ్య, బంధం తిరుపతిరావు, చెరుకు రామకృష్ణ, యనమద్ది శ్రీనివాసరావు, దొప్పా కృష్ణ, సూర్యదేవర సుధాకర్ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం: స్థానిక రింగ్ సెంటర్లో దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ద హనం చే శారు. చావా రామకృష్ణ, దేవకొండ శిరీష, పంబి సాంబశివరావు, యన్నం శ్రీనివాసరెడ్డి, కొండేపాటి సాంబశివరావు, మగిర పాలురాజు, అప్పారావు, పురుషోత్తంరాజు, భూక్యా రాము, సగ్గుర్తి కిషోర్ పాల్గొన్నారు.
నేలకొండపల్లి: స్థానిక ప్రధాన సెంటర్లో మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు దహనం చేశారు. వజ్జా రమ్య, ఉన్నం బ్రహ్మయ్య, నెల్లూరి లీలాప్రసాద్, కోటి సైదారెడ్డి, శీలం వెంటకలక్ష్మి, గండు సతీష్, గొలుసు రవి, ఎండి.వాజిద్, వజ్జా శ్రీనివాసరావు, వెన్నబోయిన శ్రీనివాసరావు, పెద్దపాక వెంకటేశ్వర్లు, కొండా కనకప్రసాద్, మంకెనపల్లి రాము, బచ్చలకూరి శ్రీను పాల్గొన్నారు.
మధిర రూరల్: మధిరలోని అంబేద్కర్ సెంటర్లో మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దహనం చేశారు. ముందుగా ద్విచక్ర వాహనాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. దొండపాటి వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చావా వేణు, అబ్బూరి రామన్, బాహాటం శ్రీనివాసరాజు, యన్నంశెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, మొండెం వెంకన్న, ఆళ్ల నాని, ఆవుల రామకృష్ణ, కోన నరేంద్రర్రెడ్డి, పల్లపోతు ప్రసాద్, కరివేద సుధాకర్, వంకాయలపాటి నాగేశ్వరరావు, గుగులోతు కృష్ణానాయక్, మొండెం వెంకన్న పాల్గొన్నారు.
ముదిగొండ: టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు నల్ల బ్యాడ్జీలు ధరించి బస్టాండ్ సెంటర్ వరకు మోదీ దిష్టిబొమ్మను ఊరేగించారు. దానిని బస్టాండ్ సెంటర్లో దహనం చేశారు. వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, సామినేని హరిప్రసాద్, బండ్ల వాసు, పసుపులేటి వెంకట్, బంక మల్లయ్య, పంది శ్రీను, వేముల శ్రీనివాస్, దార రాము, తేరాల రామారావు, చిరుమర్రి యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దహనం చేశారు. చావా వేణుగోపాలకృష్ణ, బాషబోయిన వీరన్న, ఎస్కె.షకీల్, గంట కృష్ణ, బోడ మంచానాయక్, పోలెపొంగు రామచంద్రు, వెంకటేశ్వర్లు, వనవాసం వెంకటరెడ్డి, రవి పాల్గొన్నారు.
కూసుమంచి: కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో సూర్యాపేట-ఖమ్మం రహదారిపై ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటూరి శేఖర్, రామసహాయం బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్, వడ్త్యి సేట్రాం నాయక్, వేముల వీరయ్య, వీరవెల్లి నాగేశ్వరరావు, బానోత్ రాంకుమార్, తిప్పని అలివేలమ్మ, తంగెళ్ల బుచ్చిబాబు, ఆసీఫ్ పాషా, చాట్ల పరశురాం, బెల్లం వేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్, బెల్లం ఉమ, గుడా సంజీవ రెడ్డి పాల్గొన్నారు.