ఖమ్మం, డిసెంబర్ 21: రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిషరించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. యంత్రాంగమంతా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ధరణి, రిజిస్ట్రేషన్లు, భూసేకరణ, బల్ సమస్యలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో నూతన కలెక్టరేట్లో గురువారం ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సంబంధ దరఖాస్తులపై వెంటనే పరిషార చర్యలు చేపట్టాలన్నారు. ధరణి, టీఎం-33 ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో పెండింగ్ ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిషరించాలని సూచించారు. జీఎల్ఎం సక్సేషన్, మ్యుటేషన్ల దరఖాస్తుల ఫైళ్లు వెంటనే సమర్పించాలన్నారు. ఫైళ్లను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరచాలన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పోస్ట్ అవార్డ్ పనులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. స్ట్రక్చర్లకు చెల్లింపులు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ల స్లాట్లు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. దరఖాస్తుదారులకు సమయమిచ్చి దరఖాస్తులను పరిషరించాలన్నారు. గుర్తించిన బల్ సమస్యలకు సంబంధించి చర్యలు వేగవంతం చేయాలన్నారు.
సర్వే, విచారణలు త్వరితగతిన పూర్తి చేసి అర్హులకు పట్టాల జారీకి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు స్థల సేకరణలు పూర్తి చేయాలన్నారు. వేర్ హౌజింగ్ గోడౌన్ల కోసం ఒకో డివిజన్లో 50 ఎకరాల చొప్పున భూసేకరణ చేయాలన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల కోసం ప్రతి మండలంలో 2 ఎకరాల భూమిని గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై తీసుకున్న చర్యల నివేదిక సమర్పించాలన్నారు. జీవో 59లో తిరసరణకు గురైన దరఖాస్తులకు సంబంధించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మీ సేవ దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిషరించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 1209 డొంకలుండగా వాటిల్లో 69 డొంకలు ఆక్రమణకు గురైనట్లు చెప్పారు. వెంటనే సర్వే చేపట్టి, డొంకల్లో ఆక్రమణలు తొలగించి ఉపాధి హామీ కింద రహదారుల ఏర్పాటుచేసి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. చెకులు సిద్ధంగా ఉన్నచోట వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. కోర్టు కేసుల విషయంలో టైం బాండ్, డైరెక్షన్లపై వెంటనే చర్య లు తీసుకోవాలని అన్నారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఇతర అధికారులు గణేశ్, అశోక్ చక్రవర్తి, శ్రీనివాసులు, అరుణ తదితరులు పాల్గొన్నారు.