హైదరాబాద్లో అన్ని హంగులు, వసతులతో నిర్మించిన రాష్ట్ర సచివాలయం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. అయిదో అంతస్తులోని రవాణాశాఖ మంత్రి క్యాబిన్లో ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆశీనులయ్యారు. మంత్రిని ఆయన తల్లిదండ్రులు పువ్వాడ నాగేశ్వరరావు, విజయలక్ష్మి ఆశీర్వదించారు. వారికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, మేయర్, సుడా చైర్మన్, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. – నమస్తే నెట్వర్క్
హైదరాబాద్లో నడిబొడ్డున నిర్మించిన సచివాలయం ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రాములునాయక్, హరిప్రియానాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్రాజు, ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అనుదీప్, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతామహాలక్ష్మి, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి పువ్వాడ అజయ్కు ఆశీర్వచనాలు.. శుభాకాంక్షలు
అయిదో అంతస్తులోని రవాణాశాఖ మంత్రి క్యాబిన్లో ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆశీనులయ్యారు. మంత్రిని ఆయన తల్లిదండ్రులు పువ్వాడ నాగేశ్వరరావు, విజయలక్ష్మి ఆశీర్వదించారు. వారికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పువ్వాడకు జిల్లా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేకంగా తయారు చేయించిన మాలను సీఎం కేసీఆర్ మెడలో వేసి ఆశీర్వాదం తీసుకున్నారు.