కారేపల్లి రూరల్, జూన్ 5: కొమ్ముగూడెం గ్రామాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి శనివారం సందర్శించారు. గ్రామంలో హోం ఐసొలేషన్లో ఉన్న కొవిడ్ బాధితులతో మాట్లాడారు. గాంధీనగరం ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీవో రమాదేవి, ఎస్సై సురేశ్ పాల్గొన్నారు. మండలంలోని గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ హనుమంతురావు ప్రత్యేక వైద్య శిబిరాలను పర్యవేక్షించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలను మండల అధికారుల బృందం శనివారం సందర్శించింది.
కారేపల్లి, జూన్ 5 : తెలంగాణ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి శనివారం సందర్శించారు. కొవిడ్ బాధితులతో మాట్లాడి,వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కారేపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరెడ్డి దంపతులు వితరణగా అందజేసిన పండ్లను కొవిడ్ బాధితులకు సర్పంచ్ పంపిణీ చేశారు.
సత్తుపల్లి రూరల్, జూన్ 5: కరోనా కట్టడిలో భాగంగా పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వీధి వ్యాపారులకు, కిరాణ, మెడికల్ షాపుల్లోని వర్కర్లకు వ్యాక్సిన్ వేశారు. మున్సిపల్ కమిషనర్ సుజాత పరిశీలించి వ్యాపారాలు నిర్వహించే వారు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. మున్సిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వేంసూరు, జూన్ 5: కరోనాను కట్టడి చేసే క్రమంలో ఆయా సర్పంచ్లతో మాట్లాడి కొవిడ్ టెస్టులను ప్రతి రోజు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కొవిడ్ పరీక్షలను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో మమత, అక్బర్, వెంకటరత్నం, సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీల్లో సర్పంచ్లు పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కరోనా కేసులున్న ప్రదేశాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
వైరా, జూన్ 5 : మున్సిపాలిటీ పరిధిలోని చిరు వ్యాపారులకు కరోనా వ్యాక్సినేషన్ను మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఏదునూరి శ్రీను, అప్పం సురేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీలో శనివారం మొత్తం 285 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 63 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ శశిధర్ తెలిపారు.