మామిళ్లగూడెం, మార్చి 16: జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీరు సరఫరా చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎన్నెస్పీ సాగునీటి సరఫరా గురించి నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఐడీవోసీలో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యాచరణ ప్రకారం సాగు నీరు అందించాలని సూచించారు. బీబీసీ కింద ఎకువగా ఆరుతడి పంటలు ఉన్నందున వాటికి ఇప్పటికే నాలుగైదు తడులకు నీరందించినట్లు తెలిపారు. ఆయకట్టు చివరి వరకూ నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సత్తుపల్లి, తల్లాడ, వైరా తదితర ప్రాంతాలకు నీరందించడం వల్ల ఇప్పుడు సమస్యలు లేవన్నారు. సాగునీటి సరఫరాపై రైతులు అందోళన చెందకుండా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు శంకర్నాయక్, ఆనంద్, నర్సింగరావు, శ్రీనివాసాచారి, ఎం.వెంకటేశ్వర్లు, అననీయ, రామకృష్ణ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
రేబిస్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి
పట్టణాలు, గ్రామాలను రేబిస్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాల్సి బాధ్యత అక్కడి అధికారులదేనని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. జంతు జనన నియంత్రణ కేంద్రాలు, కుకల స్టెరిలైజేషన్పై ఐడీవోసీలో గురువారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుక కరిస్తే వెంటనే సబ్బుతో గట్టిగా ఒత్తి కడిగి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి రేబిస్ వ్యాధి నిరోధక టీకా వేయించాలని సూచించారు. జంతు జనన నియంత్రణను ఖమ్మంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో చేపడుతున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించేలా చూడాలని, ఆరు నెలల్లో జిల్లాలోని వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. వీధి కుకల సంబంధిత ఫిర్యాదుల కోసం 6301859174, 7901298265 నెంబర్లతో ఖమ్మంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జడ్పీ సీఈవో అప్పారావు, వివిధ శాఖల అధికారులు వేణుమనోహర్, మాలతి, విద్యాచందన, సంధ్యారాణి, పుల్లారావు, ప్రభాకర్, రమాదేవి, సుజాత, అనిత పాల్గొన్నారు.