తల్లాడ, డిసెంబర్ 17: పేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి లాంటి పథకం తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని స్పష్టం చేశారు. మండలలోని అన్నారుగూడెం రైతువేదికలో బాలపేట, నరసింహారావుపేట, గోపాలపేట గ్రామాలు, కుర్నవల్లి రైతువేదికలో కలకొడిమ, ముద్దునూరు, లక్ష్మీపురం, కేశవాపురం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప దేశంలో మరెవ్వరూ లేరని గుర్తుచేశారు.
కల్యాణలక్ష్మి పథకం.. నిరుపేద కుటుంబాల్లోని ఆడ పిల్లల తల్లిదండ్రులకు ఎంతో ధైర్యాన్నిస్తోందని స్పష్టం చేశారు. అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని గుర్తుచేశారు. గడిచిన మూడేళ్లలో సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.17 కోట్లను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించారని వివరించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు రాయల వెంకటశేషగిరిరావు, దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, దూపాటి భద్రరాజు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, గంటా శ్రీలత, రాధిక, అయిలూరి ప్రదీప్రెడ్డి, అయిలూరి లక్ష్మి, జొన్నలగడ్డ కిరణ్, శీలం కోటారెడ్డి, ఓబుల సీతారామిరెడ్డి, వనిగండ్ల అలేఖ్య, ఆదూరి దాసురావు, కోసూరి వెంకట నరసింహారావు, బద్ధం కోటిరెడ్డి, దిరిశాల దాసురావు, మోదుగు ఆశీర్వాదం, జీవీఆర్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, వరపర్ల ఉదయ్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ
మండలంలోని కుర్నవల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీవెంకటచలపతిస్వామి దేవాలయం వద్ద నూతనంగా ప్రతిష్ఠించనున్న శ్రీఅభయాంజనేయస్వామి విగ్రహం నిర్మాణానికి, కల్యాణ మండప నిర్మాణానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం భూమిపూజ చేశారు.
ఆలయ అర్చకుడు ముదివర్తి వరప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో భూమిని వితరణ చేసిన దాత అయిలూరి వెంకటనర్సిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో టీఆర్ఎస్ యువజన నాయకుడు షేక్ హుస్సేన్ ఇంటికి వెళ్లి చిన్నారి నైరాను ఆశీర్వదించారు.