చుంచుపల్లి, జూలై 29 : తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ కుమార్ మిత్రులు ఎస్.రఘురాం, లలిత (USA) ఆర్థిక సహకారంతో గరిమెళ్లపాడు, చండ్రుకుంట పాఠశాలల్లోని 75 మంది గిరిజన విద్యార్థులకు సుమారు రూ.10 వేల విలువైన నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర విద్యా సామగ్రిని బుధవారం పంపిణీ చేశారు. అలాగే అంగన్వాడీ చిన్నారులకు పలకలు, బలపాలు అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు, సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ… విద్యార్థులు విద్యా సామగ్రిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అంజనానందం, జోసెఫ్, హెచ్ఎంలు సీతారాములు, కిరణ్మయి, సర్పంచ్ రాము, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.