చింతకాని: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతున్నదని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో రైల్వేకాలనీ గ్రామంలో పలు పార్టీల నుంచి 20 కుటుంబాలు జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ సమక్షంలో చేరారు. అనంతరం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన సీఎం కేసీఆర్తోనే దళితులతో పాటు సబ్బండ వర్గాలకు న్యాయం జరగుతోందని, స్వాతంత్రం తర్వాత దళితుల కోరకు ఈ స్ధాయిలో పథకం పెట్టిన సీఎంలు లేరని, చింతకాని మండలంలోని దళిత లబ్ధిదారులకు నేరుగా ఫలాలు చేరడం గర్హనీయమని, సీఎం కేసీఆర్కు కృతజ్ఞులమని కోనియాడారు.
పల్లెలకు టీఆర్ఎస్ పాలనలో నిధులు అధికంగా కేటాయిస్తున్నదని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని వారు అన్నారు.టీఆర్ఎస్ పాలనలో కంచుకోటలు బద్దలవుతున్నాయని, ఎట్టిపరిస్ధితుల్లో మధిరలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, వైస్ఎంపీపీ గురజాల హనుమంతరావు, రైతుసమన్వయసమితి జిల్లా సభ్యులు మంకెన రమేశ్, సోసైటీచైర్మన్ నల్లమోతు శేషగిరి, సర్పంచులు పరిటాల యలమంద, చాట్ల సురేశ్, బండి రమాదేవి, నాయకులు వంకాయలపాటి వెంకటలచ్చయ్య, నారపోగు నాగయ్య, సామినేని అప్పారావు, బండి రామారావు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.