ఖమ్మం రూరల్, మార్చి 26: బీఆర్ఎస్ సభ్యుడికి మంజూరైన బీమా పరిహార పత్రాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. మండలంలోని గుర్రాలపాడుకు చెందిన జాల సురేశ్ కొద్దికాలం క్రితం మరణించాడు. అప్పటికే అతడికి బీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో అతడికి రూ.2 లక్షల బీమా పరిహారం మంజూరైంది. దీనిని స్థానిక బీఆర్ఎస్ నాయకుడు శీలం రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో సురేశ్ కుటుంబ సభ్యులైన జాల రామయ్య, చంద్రమ్మలకు అందజేశారు. తమ కుమారుడు చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమకు బీమా పరిహారాన్ని అందించేందుకు కృషిచేసిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్కు బాధిత కటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.