మణుగూరు టౌన్, ఆగస్టు 30: పినపాక నియోజకవర్గం అభివృద్ధికి ఐకాన్గా నిలుస్తున్నదని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం ఆయన పగిడేరు గ్రామంలో పర్యటించి రూ.6.67 కోట్ల నిధులతో చేపడుతున్న శాంతినగర్-కొడిశలకుంట బీటీ రోడ్డుకు భూమిపూజ, సాంబాయిగూడెం- పగిడేరు వరకు బీటీ రోడ్డు మరమ్మతులు, రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మందంజలో నిలిపామన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు వచ్చే ఎన్న్కిల్లో బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, కార్యదర్శులు బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, నాయకులు వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, జావేద్ పాషా పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి 50 కుటుంబాలు
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి ఎంతోమంది ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. పగిడేరులో కాంగ్రెస్పార్టీతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 కుటుంబాలు బుధవారం ప్రభుత్వ విప్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ గుర్తిస్తుందన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.