అభివృద్ధి.. సంక్షేమం జోడెడ్లలా తెలంగాణ పాలన సాగుతున్నది. డైనమిక్ నేతగా సీఎం కేసీఆర్ ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్నారు. పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేయూతనందిస్తున్నారు. కుల వృత్తిదారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. రుణ సదుపాయం కల్పిస్తున్నారు. తాజాగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీలకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.లక్ష రుణం అందిస్తున్నారు. అంతేకాదు.. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.3,016గా ఉన్న ఆసరా పింఛన్ను రూ.4,016 చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు. – నమస్తే నెట్వర్క్
గొర్రెల యూనిట్లు మంచి చేస్తున్నాయి
రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా ఇటీవల నాకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు యూనిట్ మంజూరైంది. గొర్రెల పంపిణీతో మా లాంటి నిరుపేద యాదవులకు మేలు జరుగుతున్నది. తెలంగాణ పథకాలను ఆంధ్రా ప్రజలు మెచ్చుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అక్కడి ప్రజలూ కోరుకుంటున్నారు. పొరుగు రాష్ర్టానికి చెందిన యాదవులు కొందరు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి గొర్రెల పంపిణీ పథకం గురించి తెలుసుకున్నారు.
– వరదబోయిన ధనమ్మ, గ్రామస్తురాలు, ఇల్లూరు, మధిర మండలం
దివ్యాంగుల పెన్నిధి కేసీఆర్
దివ్యాంగులు, వృద్ధులు ఎవరిపైనా ఆధారపడకుండా సీఎం కేసీఆర్ నెలనెలా ఠంచనుగా పింఛన్ ఇస్తున్నారు. పేదల పాలిటి దేవుడు కేసీఆర్. ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ పేదలను పట్టించుకోలేదు. మా దివ్యాంగుల సమస్యలను విన్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మా గోడు పట్టించుకున్నారు. పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచారు. కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– రాయబారపు కొండమ్మ, అంధురాలు, జక్కేపల్లి ఎస్సీకాలనీ, కూసుమంచి మండలం
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. మత్స్యకారుల కోసం పూర్తి రాయితీపై చెరువుల్లో చేప పిల్లలు వదులుతున్నారు. రాయితీపై వలలు, వేట సామగ్రి, వాహనాలు అందజేస్తున్నారు. కల్లుగీత కార్మికులకు అనేక రాయితీలు అందిస్తున్నారు. వైన్ షాపుల కేటాయింపులో బీమా సౌకర్యం, రిజర్వేషన్ కల్పిస్తున్నారు. తాజాగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీలకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.లక్ష రుణం అందిస్తున్నారు. అంతేకాదు.. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.3,016గా ఉన్న ఆసరా పింఛన్ను రూ.4,016 చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు.
– నమస్తే నెట్వర్క్
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి టౌన్, జూన్ 11: దివ్యాంగుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దివ్యాంగులకు పింఛను పెంచినందుకు ఆదివారం సత్తుపల్లి పట్టణంలో దివ్యాంగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి మాట్లాడారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా కేసీఆర్ చేయూతనిస్తున్నారన్నారు. భవిష్యత్లో దివ్యాంగుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు రూపొందిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంమున్సిపల్ కమిషనర్ సుజాత, ఆత్మచైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, షేక్ చాంద్పాషా, బీఆర్ఎస్ నాయకుడు చల్లగుళ్ల కృష్ణయ్య, పార్టీ వేంసూరు, పెనుబల్లి మండలాల అధ్యక్షులు పాల వెంకటరెడ్డి, కనగాల వెంకట్రావు పాల్గొన్నారు.
దివ్యాంగుల పక్షపాతి సీఎం కేసీఆర్
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి టౌన్, జూన్ 11: దివ్యాంగుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దివ్యాంగులకు పింఛను పెంచినందుకు ఆదివారం సత్తుపల్లి పట్టణంలో దివ్యాంగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి మాట్లాడారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా కేసీఆర్ చేయూతనిస్తున్నారన్నారు. భవిష్యత్లో దివ్యాంగుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు రూపొందిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంమున్సిపల్ కమిషనర్ సుజాత, ఆత్మచైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, షేక్ చాంద్పాషా, బీఆర్ఎస్ నాయకుడు చల్లగుళ్ల కృష్ణయ్య, పార్టీ వేంసూరు, పెనుబల్లి మండలాల అధ్యక్షులు పాల వెంకటరెడ్డి, కనగాల వెంకట్రావు పాల్గొన్నారు.
దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు
ఎమ్మెల్యే హరిప్రియానాయక్
ఇల్లెందు రూరల్, జూన్ 11: దివ్యాంగుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో ఆదివారం ఆమె దివ్యాంగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు పులిగళ్ల మాధవరావు, కృష్ణ, యలమద్ది రవి, రాచపల్లి శ్రీను, బొమ్మెర వరప్రసాద్, చీమల సత్యనారాయణ, కాలే ప్రసాద్, మహేశ్, రాజశేఖర్, నిఖిల్, రాజేశ్ పాల్గొన్నారు.
కేసీఆర్ సల్లంగుండాలి..
రూ.వెయ్యి పింఛన్ పెంచి సీఎం కేసీఆర్ రూ.4,016 చేశారు. దివ్యాంగులకు అండగా నిలుస్తున్న కేసీఆర్ సల్లంగుండాలి. వచ్చే ఎన్నికల్లోనూ కేసీఆర్ విజయం సాధిస్తారు. మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. పింఛను పెంచినందుకు దివ్యాంగుల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
– గొల్లమూడి శ్రీను, లబ్ధిదారు, సత్తుపల్లి
కేసీఆరే మా దేవుడు..
తెలంగాణ ఏర్పడకముందు దివ్యాంగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మమ్మల్ని ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే మా పింఛను పెరిగింది. గత నెల వరకు మాకు నెలకు రూ.3,016 అందేది. వచ్చే నెల నుంచి రూ.4,016 పించను అందనున్నది. దేశంలో దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కార్. కేసీఆరే మా దేవుడు.
– పొన్నం మోహన్రావు, గంగిదేవిపాడు, పెనుబల్లి మండలం
కేసీఆర్ రుణం తీర్చుకోలేం..
దివ్యాంగులు నిస్పృహ చెందకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ నెలకు ఠంచను గా పింఛను ఇస్తున్నారు. పింఛనుతో ది వ్యాంగులు సమాజంలో అందరిలాగానే ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. రూ.3,016 ఉన్న పింఛనును తాజాగా సీఎం కేసీఆర్ మరో రూ.వెయ్యి పెంచారు. పింఛను పెంపు ప్రకటనలతో మా ఆనందం రెట్టింపు అయింది. ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేం. పేదలు, దివ్యాంగులపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక ప్రేమ ఉన్నది.
– మాలోతు భావన, లబ్ధిదారు, చీన్యాతండా, పెనుబల్లి మండలం
సీఎం కేసీఆర్ చల్లగుండాలి..
గత ప్రభుత్వాల హయాంలో దివ్యాం గులు కేవలం రూ.500 పింఛన్ తీసు కున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ అధి కారంలోకి వచ్చాక పింఛను నెలకు రూ.1500 పెరిగింది. తర్వాత రూ.3016కు పెరిగింది. తాజాగా సీఎం కేసీఆర్ మరో రూ.వెయ్యి పెంచి ఏకంగా రూ.4016 చేశారు. దివ్యాంగుల సంక్షే మం గురించి ఆలోచిస్తున్న కేసీఆర్ ఆయురారోగ్యాలతో చల్లగా జీవించాలి. దివ్యాంగులంతా ఆయనకు రుణపడి ఉంటారు.
– ముళ్లపూడి ఏసయ్య, దివ్యాంగుడు, సత్తుపల్లి
రూ.వెయ్యి పెంపు హర్షణీయం..
దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గత పాలకులు ఎలక్షన్స్ సమయంలో దివ్యాంగులకు హామీలు ఇచ్చే వారు తప్పితే నెరవేర్చేవారు కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ దివ్యాంగుల బాగోగులను చూసుకుంటున్నారు. నెలకు రూ.3,016 చొప్పున పింఛను అందిస్తున్నారు. తాజా గా మరో రూ.వెయ్యి పెంచారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా 1,800 మంది ది వ్యాంగులు పింఛను పొందుతున్నారు. వారందరూ సీఎం ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– షేక్ ముస్తఫా, దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడు, బోనకల్లు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ మేం అడగకుండానే గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టారు. యాదవులకు గొర్రెల యూనిట్లు అందజేస్తున్నందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. యూనిట్లతో యాదవ కుటుంబాలు బలపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని ఈ పథకం అమలవుతున్నది.
– జోనుబోయిన శ్రీనివాసరావు, యాదవ సంఘం దమ్మపేట మండల అధ్యక్షుడు, ముష్టిబండ
చాలా సంతోషంగా ఉంది
చేతి పనులు చేసుకునే వాళ్లకి కూడా ప్రభుత్వం సాయం చేస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. సీఎం కేసీఆర్ మా చేతివృత్తుల కులాల పాలిట దేవుడే. మంచి సమయంలో లక్ష రూపాయలు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. పేదలు తమ కోసం పని చేసిన వారిని ఎప్పటికీ మరచిపోరు.
– ప్రభాకర్, కార్పెంటర్, పాల్వంచ
మేం ఊహించలేదు..
దివ్యాంగులు ఏ పనీ చేసుకోలేరనే దయతో సీఎం కేసీఆర్ సార్ పింఛన్ పెంచడం ఎంతో సంతోషంగా ఉంది. మా గురించి అందరూ మాటలు చెప్పే వాళ్లే. సీఎం సార్ మాత్రం రూ.1000 పింఛన్ పెంచడం మేం ఊహించలేదు. ఆయన కలకాలం సీఎంగా ఉండాలి.
– గుగులోతు కౌసల్య, పాల్వంచ
యాదవుల సంక్షేమం కోసం గొర్రెల పంపిణీ..
రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమల అభ్యున్నతి కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నది. యూనిట్లతో లబ్ధిదారులకు మేలు జరుగుతున్నది. అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు 77,931 గొర్రెలు అందాయి. రెండో విడతలో 7,539 గొర్రెలు అందిస్తాం. యూనిట్లపై సర్కార్ 75శాతం ఇస్తుంది. లబ్ధిదారులు కేవలం 25 శాతం డీడీ చెల్లిస్తే చాలు.
– మన్యం రమేష్బాబు, మండల పశువైద్యాధికారి, దమ్మపేట
కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
నేను నా భార్య సావిత్రి ఇద్దరం తోపుడు బండిపై చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ జీవిస్తున్నాం. మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కులవృత్తే జీవనాధారం. ఇద్దరికీ కాళ్ల నొప్పులు వచ్చాయి. తోపుడు బండిపై వెళ్లలేకపోతున్నాం. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం నాకు రూ.లక్ష చెక్కు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో స్థానికంగానే ఓ డబ్బా కొట్టు పెట్టుకొని కులవృత్తికి సంబంధించిన అధునిక పరికరాలు ఏర్పాటు చేసుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– రేపాకుల ఎల్లయ్య, రజక వృత్తిదారుడు, పిండిప్రోలు, తిరుమలాయపాలెం
మూడుసార్లు పింఛను పెంచారు..
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మూడుసార్లు దివ్యాంగుల పింఛను పెంచారు. దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారు. మేమున్నామని మాకు భరోసానిస్తున్నారు. కేసీఆర్ దివ్యాంగులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వారంతా కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– అద్దంకి అర్జున్రావు, దివ్యాంగుడు, మల్లవరం, తల్లాడ మండలం
చేతివృత్తులకు ప్రోత్సాహం..
సీఎం కేసీఆర్ చేతి వృత్తిదారులకు చే యూత ఇవ్వడం హర్షణీయం. బీసీల జీవన స్థితిగతులను చూసిన సీఎం కేసీఆర్ వారి కోసం సంక్షేమ పథకాలు అం దిస్తున్నారు. పథకాలతో అంతరించిపోతున్న కులవృత్తులకు జీవం పోస్తున్నా రు. తాజాగా ఎలాంటి గ్యారెంటీ లేకుం డా రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– తాటికొండ శంకరాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు, అన్నపురెడ్డిపల్లి
బీసీల బాంధవుడు కేసీఆర్..
బీసీల బాగు కోసం ఆలోచన చేసిన దేశంలో ఏకైక సీఎం కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా కుల వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నవారిని కేసీఆర్ కన్నబిడ్డల్లా కాపాడుకుంటున్నారు. వారిపై అమితమైన ప్రేమ చూపుతున్నారు. గతంలో కులవృత్తిదారులకు సరైన ఆదాయం రాక ఇబ్బందిపడేవారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. తాజాగా ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.లక్ష సాయం అందిస్తున్నారు. బీసీల బాంధవుడిలా నిలుస్తున్నారు.
– నేరళ్ల లాలయ్య, మన రజక సంఘం మండల అధ్యక్షుడు, అన్నపురెడ్డిపల్లి
పింఛన్ ఆత్మగౌరవాన్నిచ్చింది
ఆసరా పింఛను దివ్యాంగులకు ఆత్మగౌరవాన్నిచ్చింది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ను పెంచుతున్నది. సమైక్య రాష్ట్రంలో పింఛన్ కేవలం రూ.500 ఉండేది. స్వరాష్ట్రం వచ్చాక రూ.4,116కు పెరిగింది. దీంతో మాకు ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. సీఎం కేసీఆర్ పాలనలోనే దివ్యాంగులకు న్యాయం జరిగింది.
– ఎం.నాగలక్ష్మి, దివ్యాంగురాలు, అశ్వారావుపేట
దివ్యాంగులకు ప్రాధాన్యం
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ ప్రాధాన్యమిస్తున్నది. వారికి పింఛన్తో పాటు అవసరమైన ఉపకరణాలను సమకూరుస్తున్నది. బస్పాస్లు అందిస్తున్నది. బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేస్తున్నది. వారికి జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ నుంచి ఆర్థిక పునరావాస పథకం అమలు చేస్తున్నది.
– స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమాధికారిణి, కొత్తగూడెం
నాడు 20 జీవాలు ఇస్తే నేడు 80 గొర్రెలు..
మొదటి విడత గొర్రెల పంపిణీలో నాకు 21 గొర్రెల యూనిట్ అందింది. జీవాల సంఖ్య ఇప్పుడు 80కు చేరింది. యూనిట్తో మా కుటుంబం గాడిన పడింది. అవసరమైనప్పుడు ఒకటి, రెండు గొర్రెలు అమ్ముకుంటున్నాం. ఇప్పుడు మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది.
– పదిలం వెంకటేశ్వరరావు, లబ్ధిదారుడు, దమ్మపేట