కొత్తగూడెం సింగరేణి, జనవరి 30: స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతే కార్మికులు, కార్మిక కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు వ ర్తించాయని, ఉద్యోగావకాశాలు లభించాయని డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) చంద్రశేఖర్రావు అన్నారు. సోమవారం కా ర్పొరేట్ పరిధిలోని ఇల్లెందు గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన త ర్వాత కారుణ్య నియామకాల ద్వారా 14,801, వివిధ నోటిఫికేషన్ల ద్వారా 4500 పై చిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విద్య, వైద్యం, సంక్షేమం కోసం రూ.358 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.3.11 లక్షలను సంక్షేమం కోసం వె చ్చించినట్లు తెలిపారు. రానున్న ఐదేళ్లలో వంద మిలియన్ ట న్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తు న్నామని చెప్పారు.
సింగరేణి బొగ్గును తెలంగాణతో పాటు ఏ డు రాష్ర్టాల్లో విద్యుత్ ఉత్పత్తికి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. చిన్న చిన్న పరిశ్రమలకు బొగ్గు రవాణా చేయడం వల్ల అనేక పరిశ్రమలు నడుస్తున్నాయని, భవిష్యత్లో కూడా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి, రవాణా చేసి సింగరేణి సంస్థ ఖ్యాతిని దేశవ్యాప్తంగా నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుదుత్పత్తిలో కూడా ముందంజలో ఉన్నామని, జైపూర్ ఎస్టీపీపీ అనేక అవార్డులు సొంతం చేసుకుందని గుర్తు చేశారు. దీంతో పాటు మరో 800 మెగావాట్ల ప్లాంట్ను కూడా ప్రారంభించామని, 2027 వరకు ప్లాంట్ పనులు పూర్తవుతాయని తెలిపారు. సింగరేణిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 281 ఎగ్జిక్యూటీవ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. వీటితో పాటు 277 ఇంటర్నల్ టెక్నీషియన్ – ఈ2 గ్రేడ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు.
వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తే లక్ష్యం : డైరెక్టర్ సత్యనారాయణరావు
వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తే లక్ష్యంగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు సంస్థ వ్యాప్తంగా 9 ఏరియాల్లో 219 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించి ఉత్పత్తి చేస్తున్నామని, దీని ద్వారా 540 మిలియన్ యూనిట్ల విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించామని తెలిపారు. ఈ సోలా ర్ పవర్ ద్వారా సుమారు రూ.300 కోట్లు ఆదా అవుతున్నదన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎస్టీపీపీలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించామని, త్వరలో మానేరు డ్యాంపై కూడా ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ను నిర్మిస్తామన్నారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వెయ్యి మెగావాట్లు ఉత్పత్తే లక్ష్యంగా సోలార్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. సమావేశంలో జీఎం పర్సనల్ ఆనందరావు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.