ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్యానశాఖ ఈ విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసింది. శనివారం సహాద్రీఫామ్స్లోని వివిధ రకాల పరిశ్రమలను, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రాలను రైతులు సందర్శించారు. ఈ యాత్రలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి 100 మంది రైతులు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ. అనసూయ, ఆయా నియోజకవర్గాల అధికారులు సందీప్కుమార్, జీ నగేష్, ఏ. వేణు, కే. మీనాక్షీ తదితరులు పాల్గొన్నారు.