తిరుమలయపాలెం, మే 30 : పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచాలని, అర్హులకు నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలన్నారు. అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ తాసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమ్మకోమటి నాగేశ్వరరావు. సోమనపల్లి వెంకటేశ్వర్లు. తిమ్మిడి హనుమంతరావు, పులుగుజ్జు వెంకటస్వామి, రాయల రాజా, గోకనపల్లి సరోజినీ పాల్గొన్నారు.