‘మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నదా? పారిశుధ్య నిర్వహణ ఎలా ఉంది? ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉంటున్నారా?’ అంటూ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరవాసులను పలకరించారు. ఆదివారం నగరంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద ‘వాడ వాడకు పువ్వాడ’ కార్యక్రమాన్ని ప్రారంభించి నగరవాసుల ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రూ.1200 కోట్ల నిధులతో నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. బస్టాండ్, నగరపాలకసంస్థ కార్యాలయం, కలెక్టరేట్, ధంసలాపురంలో ఫ్లైఓవర్, నాలుగు లైన్ల రహదారులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, హబ్ నిర్మించామన్నారు. త్వరలో ఐటీ హబ్ రెండో ఫేజ్ పనులు మొదలు పెడతామన్నారు. నగరాభివృద్ధిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైతం మెచ్చుకున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు పనిచేస్తామన్నారు.
– ఖమ్మం, జనవరి 1
ఖమ్మం, జనవరి 1: రూ.1200 కోట్ల నిధులతో ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ‘వాడ వాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన నగరపాలకసంస్థ అధికారులతో కలిసి ఖమ్మ నగరంలోని 17, 27 డివిజన్లలో పర్యటించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నాయా? మీ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉందా? అంటూ ఇంటింటికీ వెళ్లి నగరవాసులను పలకరించారు.
సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నగరంలో బస్టాండ్, నగరపాలకసంస్థ కార్యాలయం, కలెక్టరేట్, ధంసలాపురంలో ఫ్లైఓవర్, నాలుగు లైన్ల రహదారులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, హబ్ నిర్మించామన్నారు. త్వరలో ఐటీ హబ్ రెండో ఫేజ్ పనులు మొదలు పెడతామన్నారు. సీఎం కేసీఆర్ నగరాభివృద్ధిని మెచ్చి ఇతర జిల్లాల యంత్రాంగానికి చెప్తున్నారన్నారు. ఖమ్మం నగరాభివృద్ధిని చూసి తమ నగరాలు, పట్టణాల్లో ఈ తరహాలో అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారన్నారు. హైదరాబాద్ స్థాయిలో ఎస్డీఎఫ్ నిధులతో 140 వీడీఎఫ్ రోడ్లు నిర్మించామన్నారు. రూ.30 కోట్ల మున్సిపల్ నిధులతో 42 కిలోమీటర్ల మేర డ్రెయిన్లు నిర్మిస్తున్నామన్నారు.
నియోజకవర్గ పరిధిలో గుడిసెల్లో నివాసం ఉంటున్న 10 వేల మంది, వెలుగుమట్ల, వైఎస్ఆర్కాలనీలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చామన్నారు. రూ.100 కోట్లతో గోళ్లపాడు చానెల్ను అభివృద్ధి చేశామని, చానల్పై పార్క్లు నిర్మించామన్నారు. ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశామన్నారు. నగరం నుంచి కోయచెలక వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించామన్నారు. రూ.35 కోట్లతో కొత్త కలెక్టరేట్ వరకు నాలుగు లైన్ల రోడ్లు నిర్మించామన్నారు. కేవలం రూ.1 రుసుము తీసుకుని నగరంలో 35 వేల నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు.
మిషన్భగీరథ పథకానికి ప్రభుత్వం రూ.300 కోట్లు వెచ్చిందన్నారు. నగరంలో 30 వేల మందికి పింఛను ఇస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ.75 కోట్ల విలువైన చెక్కులు అందజేశామన్నారు. రూ.32 కోట్లు సుడా నిధులతో డ్రైన్లు, రోడ్లు నిర్మించామన్నారు. తనను ఎదుర్కోలేకే కొంతమంది కార్పొరేటర్లపై ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనుంచి వారంలో ఎక్కువ రోజులు ఖమ్మంలోనే అందుబాటులో ఉంటానన్నారు. 27వ డివిజన్ అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ప్రారంభమైన పర్యటన 17వ డివిజన్లోని శ్రీనివాసనగర్, కాలువకట్ట వరకు సాగింది.
నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పార్టీ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ రంజిత్కుమార్, కార్పొరేటర్లు ధనాల రాధ, కర్నాటి కృష్ణ, గజ్జల లక్ష్మి, తోట ఉమారాణి, పసుమర్తి రామ్మోహన్రావు, రుద్రగాని శ్రీదేవి, సరస్వతి, పగడాల శ్రీవిద్య, గోళ్ల చంద్రకళ, మాటేటి అరుణ, తోట గోవిందమ్మ, పార్టీ నాయకులు పాలడుగు పాపారావు, ధనాల శ్రీకాంత్, మందడపు రామకృష్ణ, కొండయ్య, యర్రా అప్పారావు, గోళ్ల వెంకట్, తిరుపతయ్య, మస్తాన్, కన్నం ప్రసన్న కృష్ణ, తాజుద్దీన్, మాటేటి కిరణ్, శకీనా, తన్నీరు శోభారాణి, కొల్లు పద్మ, మేకల సుగుణారావు, తోట రామారావు, తోట వీరభద్రం, భద్రయ్య, తోడేటి లింగరాజు, వంగాల వెంకట్, రాజేశ్, ఆర్డీవో రవీ్రందనాథ్, తహసీల్దార్ శైలజ, ఆర్ఐ రమేశ్, రెవెన్యూ, విద్యుత్శాఖ అధికారులు పాల్గొన్నారు.
నగరంతో విడదీయలేని అనుబంధం..
మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు ప్రజలు అడుగడునా బ్రహ్మరథం పట్టారు. తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావుతో నగరవాసులకు వీడిదీయ లేని అనుబంధం ఉందని, ఆ అభిమానంతో ఆయన్నూ రెండుసార్లు, తనను రెండుసార్లు గెలిపించారని మంత్రి గుర్తుచేశారు. ఆసుపత్రి పెట్టినా మరొకటి స్థాపించినా ప్రజాసేవే తనకు పరమావధి అన్నారు. ‘వాడవాడ పువ్వాడ’ అనే నినాదం కార్యకర్తల నుంచి వచ్చిందన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో వినూత్నంగా పర్యటన చేపడుతున్నామన్నారు. అధికారులను వెంటబెట్టుకొని ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం ఏడాదంతా కొనసాగుతుందన్నారు. నగరాభివృద్ధిని చూసిన తర్వాత ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడికీ విమర్శించే సాహసం చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ‘ఈ గడ్డ మీదే నేను పుట్టా. చదువుకున్నా. ఇక్కడే పెరిగా. 30 ఏండ్లుగా మా కుటుంబాన్ని మీరు గుండెల్లో పెట్టుకున్నారు. మీ మేలు మరువను.’ అని అన్నారు. నగరం నలువైపులా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నగరాన్ని విస్తరించామన్నారు. గత పాలనలో నీళ్ల కోసం వీధుల్లో యుద్ధాలు జరిగేవని, మిషన్భగీరథ పథకంతో ఇబ్బందులు తప్పాయన్నారు. తాను ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందిస్తుంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇతర ప్రజాప్రతినిధులనూ తనలా పంపిణీ చేయాలని ఆదేశించారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తుంటే కేంద్రంలోని బీజేపీ మాత్రం గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరస్తున్నదని మండిపడ్డారు. ఖమ్మం మేయర్ నీరజ, సుడా చైర్మన్ వియ్కుమార్తో పాటు 45 కార్పొరేటర్లు సమష్టి కృషితోనే నగరాభివృద్ధి సాధ్యమైందన్నారు. డీసీసీబీ చైర్మన్ కురాకుల ఒక్క రూపాయి కూడా ఆశించకుండా బ్యాంక్ను లాభాల బాటలో నడిపిస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు లేకుండా మేయర్ మంచి పేరు తెచ్చుకుంటున్నారన్నారు. సొమ్ములతోనే అన్ని పనులు జరగవని, గుణం, నైతిక విలువలు ముఖ్యమని అభిప్రాయపడ్డారు.