ఖమ్మం, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి ఉదయం 10.30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించి అక్కడ పట్టభద్రులతో జరిగే సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మధిర, సాయంత్రం 5.30 గంటలకు పాలేరు నియోజకవర్గాల్లో పట్టభద్రులను కలిసి ప్రచారం చేస్తారని, ఆయా ప్రాంతాల్లో జరిగే సమావేశాల్లో మాట్లాడుతారని పేర్కొన్నారు. ఆయా సమావేశాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.